నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
4న కొవ్వూరుకు విజయమ్మ
01 Nov 2012 2:29 PM
ఏలూరు:
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల నాలుగున వైయస్ఆర్ కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు కానుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ సభలో పాల్గొంటారు. గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత(టీడీపీ), కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల తెలుగుదేశం ఇన్చార్జులు కొఠారు రామచంద్రరావు, కర్రా రాజారావు కూడా వీరితో పాటు పార్టీలో చేరతారు. కృష్ణబాబు నేతృత్వంలో తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని తానేటి వనిత ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు గురువారం పరిశీలించారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ సీఈసీ సభ్యుడు కొయ్యా మోషెన్ రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, తోట గోపి, తదితరులు వీరిలో ఉన్నారు.