32 రోజుల్లో మొత్తం 420.9 కి.మీలు

జూలకల్ 18 నవంబర్ 2012 : 'మరో
ప్రజా ప్రస్థానం'
 లో షర్మిల 32వ రోజు పాదయాత్ర ముగిసింది. ఆదివారం షర్మిల 17 కిలోమీటర్ల మేర
పాదయాత్ర చేశారు. రాత్రికి జూలకల్‌లో షర్మిల బస చేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గం సి-బెళగల్
మండలంలోని నాలుగు ప్రధాన గ్రామాల గుండా షర్మిల పాదయాత్ర సాగుతోంది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సి.బెళగల్, పోలకల్లు గుండా జూలకల్ చేరుకుంది. కాగా, ఇప్పటి వరకు
'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా షర్మిల 420.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Back to Top