మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
2014 నాటికి తెలంగాణ రాష్ట్రం : కేటీఆర్
27 Aug 2012 5:26 AM
హైదరాబాద్, 27 ఆగస్టు 2012 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం 2014 ఎన్నికల లోగానే సానుకూల ప్రకటన చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆదివారం జరిగిన తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 2014 సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ సమస్యను తన ఎన్నికల అజెండాలో కేంద్రం చూడాలని కోరుకోవడంలేదన్నారు. అందుకే అప్పటి సాధారణ ఎన్నికలకు ముందే కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్యను పరిష్కరిస్తాయని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తాయన్నఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
తెలంగాణ విషయంలో కేంద్రం తన హామీని నెరవేర్చకపోతే సరైన గుణపాఠం చెప్పేందుకు ఈ ప్రాంత ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కె.టి.ఆర్. తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం కల్పించడంలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 316 మంది ప్రభుత్వ న్యాయవాదుల్లో తెలంగాణ వారు కేవలం 123 మందే ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని న్యాయవాదులకు కేటీఆర్ హామీ ఇచ్చారు.