కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రారంభమైన 191వ రోజు పాదయాత్ర
26 Jun 2013 10:47 AM
విశాఖపట్నం 26 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారానికి 191వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని కృష్ణాపురంలో ఆమె పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో మహానేత అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త బయ్యపురెడ్డిపాలెం, బలిగట్టం, ఆబిడ్ సెంటర్, నర్సీపట్నం, బొడ్డెపల్లి జంక్షన్, శ్రీరాంనగర్, లక్ష్మీపురం మీదుగా పాదయాత్ర సాగుతుంది. నర్సీపట్నం బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ 12.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.