వైయ‌స్ జ‌గ‌న్‌పై దాడిని ఖండించిన కాలిఫోర్నియా ప్ర‌వాసాంధ్రులు



కాలిఫోర్నియా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం ఘ‌ట‌న‌ను కాలిఫోర్నియా ప్ర‌వాసాంధ్రులు ఖండించారు. ఈ మేర‌కు బై ఏరియాలో వైయ‌స్ఆర్‌సీపీ కాలిఫోర్నియా విభాగానికి చెందిన నేత‌లు నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడి జరిగిన తర్వాత వైయ‌స్‌ జగన్‌ పక్క రాష్ట్రం వెళ్లిపోయారని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయారు కానీ వైయ‌స్ జగన్‌కు హైదరాబాద్‌కు వెళ్లడానికి ఎలాంటి భయం అవసరం లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అన్న విషయం ముఖ్యమంత్రి మరిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైయ‌స్‌ జగన్‌పై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. వైయ‌స్ జగన్‌పై జరిగిన దాడిని స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.



Back to Top