మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ
28 Jan 2019 3:49 PM
ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు
కృష్ణాజిల్లా: తుపాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ నూజివీడు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదని వైయస్ఆర్సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. బాధితులకు రూ.12కోట్లు చెల్లించాల్సి వుందన్నారు. రైతులకు ఇవ్వలసిన సొమ్ము ఇవ్వకుండా నేడు కొత్తగా రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం మరో వంచనగా అభివర్ణించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నూజివీడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పిన టీడీపీ నాయకులు నేడు కనబడటంలేదన్నారు. ఇంతవరుకూ సేకరించిన భూములకు కూడా డబ్బులు చెల్లించలేదన్నారు.సుమారు 40 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు.కనీసం కాల్వలు కూడా పూర్తికాలేదన్నారు