అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా

తూర్పు గోదావరి: యు.కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే వర్మపై దాడి చే శారన్న ఆరోపణలతో ఇద్దరు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.  పోలీసుల తీరుపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Back to Top