జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
కర్నూలులో వైయస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభం
07 Jun 2022 2:20 PM
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్ఆర్ యంత్ర సేవ పథకంలో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లా రైతులకు నగరంలోని ఎస్టిబిసి గ్రౌండ్లో ట్రాక్టర్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు , నగర మేయర్ బి.వై. రామయ్య , పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,కర్నూలు నగర ఎమ్యెల్యే ఎం.ఏ.హఫీజ్ ఖాన్ ,కోడుమూరు ఎమ్యెల్యే జె.సుధాకర్ బాబు,ఎం.పి. సంజీవ్ కుమార్,జె.సి. రామ్ సుందర్ రెడ్డి, కమిషనర్ భార్గవ్ తేజ,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పత్తికొండ నియోజకవర్గం లోని రైతు గ్రూపులకు మంజూరైన 19 ట్రాక్టర్లు లను, ఇంప్లిమెంట్ లను రైతు గ్రూప్ లకు అందజేశారు.