మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ

అమరావతి: మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, రికవరీ అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే జనవరి నెల పాత వేతనాలపై మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది. ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున స్టీరింగ్ కమిటీ వెళ్లింది. 

Back to Top