నాటకం సజీవమైనది

 మంత్రి అంబటి రాంబాబు 

గుంటూరు: నాటకం సజీవమైనదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సినిమాల్లో కన్నా నాటకాల్లో నటించడం చాలా కష్టమన్నారు. నాటక రంగ కళాకారులకు డబ్బులు ముఖ్యం కాదన్నారు. ప్రేక్షకులు కొట్టే చప్పట్లే వారికి గౌరవం అన్నారు.  కళా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. శుక్ర‌వారం వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకోత్సవాన్నిమంత్రి అంబ‌టి రాంబాబు సందర్శించారు.
 

Back to Top