మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయనేది అపోహ
14 May 2020 6:19 PM
హోం మంత్రి మేకతోటి సుచరిత
గుంటూరు: పవర్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కరెంట్ రీడింగ్ తీస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయనేది అపోహ అని తెలిపారు. ఏప్రిల్ నెల బిల్లులను డైనమిక్ విధానం ద్వారా తీస్తున్నామని ఆమె తెలిపారు. డైనమిక్ విధానం ప్రకారం ఎంత విద్యుత్ను వినియోగించుకున్నారో అంతే బిల్లు వస్తుందని ఆమె వివరించారు.
జూన్ 30వ తేదీ నాటికి ఎలాంటి అదనపు చార్జీలు లేవు
స్లాబ్ విధానం కాకుండా డైనమిక్ విధానంతో ప్రజలకు లాభమని మంత్రి సుచరిత తెలిపారు. ఇక లాక్డౌన్ వల్ల విద్యుత్ వినియోగం అధికంగా పెరిగిందని ఆమె చెప్పారు. జూన్ 30వ తేదీ నాటికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా బిల్లులు చెల్లించవచ్చని హోం మంత్రి సుచరిత అన్నారు.