నేడు ఏలూరు వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌తో వైయ‌స్‌ జగన్‌ భేటీ 

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇవాళ పార్టీ సమావేశం జరగనుంది. ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కీలక నేతలు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.  నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారని వైయ‌స్ఆర్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Back to Top