ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప‌రిహారం పంపిణీ

క‌ర్నూలు: వెల్దుర్తి మండలం లో ఆత్మహత్య చేసుకున్న ఏడు రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవ‌మ్మ పంపిణీ చేశారు. శుక్ర‌వారం వెల్దుర్తి సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో  బాధిత రైతు కుటుంబాల‌కు రూ. 49లక్షల మెగా చెక్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు, బాధిత కుటుంబ సభ్యులు తమని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి   వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారికి,   ప్రత్యేక చొరవ తీసుకొని త్వరగా మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Back to Top