కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
బక్రీద్ శాంతి సుహృద్భావాలను పెంపొందించాలి
12 Aug 2019 1:55 PM
ముస్లిం సోదరులకు మంత్రులు శుభాకాంక్షలు
గుడివాడ: త్యాగం, సహనానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినం ప్రజలందరి మధ్య శాంతి సుహృద్భావాలను పెంపొందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈర్ష్య, అసూయా ద్వేషాలకు అతీతంగా త్యాగమయ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు.
మానవత్వానికి, తాగ్యానికి పత్రీక:
ముస్లిం సోదరులకి రవాణా,సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండగను మానవత్వానికి, త్యాగానికి పత్రీకగా పేర్కొన్నారు
విజయవాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు:
ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆత్మీయ ఆలింగనాలతో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ముస్లింలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని తెలిపారు.