జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యం..
22 Jan 2019 1:02 PM
దళితులపై టీడీపీ నాయకుల దాడి
అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరుగుతుపోతున్నారు.అధికార టీడీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కణేకల్లు మండలం గరుడచేడులో దళితులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మహిళలనే కనికరం లేకుండా వారిని పరుష పదజాలంతో దుర్భాషలాడారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో లక్ష్మీ అనే మహిళ తన ఇంటి ముందు దుస్తులను ఉతుకుతుండగా విద్యుత్శాఖ లైన్మన్, టీడీపీ మద్దదారుడైన నామల పరుశరాం ‘నీళ్లన్నీ రోడ్డుపై వస్తున్నాయ్... ఈ ..లకు ఎక్కడ బట్టలు ఉతకాలో తెలియదం’టూ దుర్భాషలాడాడు. ఇంతలో ఇంట్లో ఉన్న లక్ష్మీ తోడికోడళ్లు జంబక్క, వండ్రమ్మలు బయటికొచ్చి మర్యాదగా మాట్లాడండని చెబితే ఆవేశంతో అతడు అందరినీ దూషించాడు. అంతటితో ఆగకుండా అతని తమ్ముడు కుమార్, మరో ఇద్దరిని పిలిపించుకొని మహిళలపై దాడి చేశాడు. వండ్రమ్మ భర్త దర్గయ్య, అతని కుమారుడు రాజు అడ్డుకోగా వారిని కులం పేరుతో తిట్టి దాడులు చేశారు. కాళ్లు, చేతులతో ఇష్టమొచ్చినట్లు చావబాదారు. తాము ఇటీవలే బటన్హోల్ ఆపరేషన్ చేయించుకున్నామని, ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రమైన కొడుపు నొప్పి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కణేకల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.