<br/>ప్రకాశం: నా భర్త చనిపోయి పదేళ్లు అవుతోంది. నాకు వితంతు పింఛన్ ఇ వ్వమని ప్రతి జన్మభూమి సభలోనూ అర్జీలు ఇ చ్చినా పట్టించుకోవడం లేదని వెంకట లక్ష్మమ్మ అనే మహిళ వైయస్జగన్కు ఫిర్యాదు చేశారు. తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పింఛన్లు ఇవ్వడం లేదని వాపోయింది. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పట్టాలని, కులాలు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.