చేతికి అందొచ్చిన కుమారుడు నరాల బలహీనతతో బాధపడుతున్నాడని మాడుగుల నియోజకవర్గానికి చెందిన సత్యవతి అనే మహిళ జననేత వైయస్ జగన్ మోహన్రెడ్డికి మొరపెట్టుకుంది. భర్త కూడా కదలలేని స్థితిలో ఉన్నాడని, ఇద్దరిని తన రెక్కల కష్టంతో పోషించుకుంటున్నాని వాపోయింది.బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేదని సాయం చేయాలని జననేతను కోరింది. వైయస్ జగన్ తప్పక ఆదుకుంటానని హమీ ఇవ్వడంతో కాస్త ఊరట చెందారు.