<br/>గుంటూరు: అన్నా.... నా భర్త మధు నాయక్, నేను కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. పంటలు సరిగా పండక పోవడంతో పనులు తక్కువగా ఉన్నాయి. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని చిన్న వ్యాపారం పెట్టుకుందామని దరఖాస్తు చేసుకున్నాం. రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా మాకు రుణం ఇవ్వడం లేదు’ అంటూ నందిగామకు చెందిన బాణావతు వెంకటకుమారి బాయి అనే మహిళ జననేత వైయస్ జగన్ వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు