పులివెందులలో సీఎం వైయ‌స్ జగన్‌ తరఫున సెట్ నామినేషన్ దాఖలు

వైయ‌స్ఆర్ జిల్లా : పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున నామినేషన్‌ దాఖలు అయ్యింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైయ‌స్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సోమవారం సీఎం వైయ‌స్ జగన్‌ తరఫున ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తరపున ఇవాళ ఒక సెట్ నామినేషన్ వేశాం. ఈ నెల 25వ తేదీ ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మద్యాహ్నాం తర్వాతే ఆయన నామినేషన్‌ వేస్తారు. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం వైయ‌స్ జగన్‌ వైపే మళ్లీ చూస్తున్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైయ‌స్‌ మనోహర్‌రెడ్డి అన్నారు.  

ప్రస్తుతం సీఎం వైయ‌స్‌ జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా  2 వేల కిలోమీటర్లు యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 21 జిల్లాలో సాగింది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే.. మరో సెట్‌తో సీఎం వైయ‌స్ జగన్‌ స్వయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్‌ వేస్తారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్ల దాఖలు చివరి తేదీ అని తెలిసిందే.

బ‌ద్వేల్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా దాస‌రి సుధ నామినేష‌న్‌

వైయ‌స్ఆర్ జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ దాస‌రి సుధా సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అశేష జనవాహినితో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన సుదా..అనంత‌రం నామినేష‌న్ ప‌త్రాలను ఎన్నిక‌ల అధికారికి అంద‌జేశారు. ర్యాలీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప పార్ల‌మెంట్ అభ్య‌ర్థి వైయ‌స్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద‌రెడ్డి, పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు. 

Back to Top