టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
తిరుమలలో దళారీ వ్యవస్థకు చెల్లు
22 Oct 2019 5:13 PM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
నిజామాబాద్: తిరుమలలో దళారీ వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలో నిర్మించిన పద్మావతి కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేసామని తెలిపారు. తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సూచించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో అన్యమత ప్రచారం పూర్తిగా రూపుమాపుతామన్నారు. రూ.10వేలు పైన విరాళాలు ఇచ్చేవారికి వీఐపీ దర్శనం ఎలా కల్పించాలనే దానిపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.