వైయస్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల నిరసన కార్యక్రమం వాయిదా

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్‌ 13వ తేదీ) తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ.. పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి. కాగా, ప్రస్తుతం ఈ కార్యక్రమం వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వైయస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారు.

Back to Top