వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భంజ‌నం

150 స్థానాల్లో ఫ్యాన్ సునామి

అమరావతి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రభంజనం సృష్టించింది. వైయ‌స్ఆర్‌సీపీ సునామికి అధికార పార్టీకి చెందిన పలువురు సిట్టింగులు సైతం తుడిచిపెట్టుకుపోయారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పంనుంచి గెలవగా ఆయన బావమరిది, సినీనటుడు బాలక్రిష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గెలుపొందారు. ఈ రెండు సీట్లు గెలవటం మినహా రాయలసీమలో ఏ స్థానంలోనూ టీడీపీ ముందజలో లేకపోవటం గమనార్హం. రాష్ట్రంలో దాదాపు 150 అసెంబ్లీ స్థానాలు సాధించి టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది. రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైయ‌స్ఆర్ సీపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో 30 చోట్ల విజయం సాధించిన వైయ‌స్ఆర్ సీపీ ఈ సారి 19 స్థానాలు అత్యధికంగా గెలిచింది. గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచిన తెలుగుదేశం ఈ సారి రెండు స్ధానాలకు మాత్రమే పరిమితమయ్యింది. గత ఎన్నికల్లో కడపలో 9స్థానాల్లో గెలిచిన వైయ‌స్ఆర్ సీపీ ఈ సారి క్లీన్‌ స్వీప్‌చేసింది. మంత్రులుగా ఉన్న వారు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిపాలవ్వటం గమనార్హం.

Back to Top