సామాజిక న్యాయానికి ప్ర‌తిబింబం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు పదవులు, అధికారాలు

పథకాల అమలులోనూ బీసీలకు అత్యధిక ప్రాధాన్యం

బీసీలకు కేంద్రంలో ప్రత్యేక  మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కనీసం రూ.లక్ష కోట్లు కేటాయించాలి

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్‌ కోసం పార్లమెంటులో బిల్లుపెట్టాలి

న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, సత్యవతి, సంజీవ్‌కుమార్‌, త‌లారి రంగ‌య్య‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: సామాజిక న్యాయం అమలులో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దేశానికే రోల్‌మోడ‌ల్‌గా నిలిచార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య‌, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌ అన్నారు. మంత్రి పదవులు మొదలు, అన్ని నామినేటెడ్‌ పదవుల్లో, ప‌నుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చార‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కేబినెట్‌లో ఏకంగా 10 మంది బీసీలు ఉన్నారని గుర్తుచేశారు. బీసీల పార్టీ అని చెప్పుకున్న వారు కూడా ఇంత‌లా సామాజిక న్యాయం పాటించ‌లేద‌ని, రాజ్యసభ టికెట్లు కూడా బీసీలకు ఎక్కువగా ఇవ్వడం జరిగింద‌న్నారు. మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులుంటే, అందులో నలుగురు బీసీలు ఉన్నారని, ఇది దేశంలో ఎవరూ చేయలేదన్నారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక  మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే వ‌ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోరాటం చేస్తామ‌న్నారు. ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, సత్యవతి, సంజీవ్‌కుమార్‌, గోరెంట్ల మాధ‌వ్, త‌లారి రంగ‌య్య‌ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు మాట్లాడుతూ.. 
బీసీలకు 50 శాతం పదవులు ఇస్తూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఏకంగా చట్టమే చేశారు. మొత్తం కార్పొరేషన్లలో 109 పదవులు, అలా 76 శాతం పదవులు బీసీలకు ఇచ్చారు. అంతే కాకుండా అన్ని పథకాల్లోనూ బీసీలకు పూర్తి న్యాయం చేస్తున్నారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కాకుండా, నిరుపేదలు అభివృద్ధి చెందేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కృషిచేస్తున్నారు. అందుకే సీఎం వైయస్‌ జగన్‌ ఒక తత్వవేత్త. సిద్దాంతకర్త. త‌మకు వైయ‌స్‌ జగన్‌ వల్లనే న్యాయం జరుగుతోందని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలు నమ్మకంతో ఉన్నారు. మరోవైపు సీఎం వైయస్‌ జగన్‌ను అనేక రాష్ట్రాల వారు అభినందిస్తున్నారు. 

ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..
బీసీల సంక్షేమం, అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ వారంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీని కలిసి దీనిపై విజ్ఞప్తి చేయబోతున్నాం. ప్రధాని స్వయంగా ఒక బీసీ. ఆయన బీసీలకు న్యాయం చేయాలి. కాబట్టి వెంటనే కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.

బీసీలకు న్యాయం జరగడం లేదు..
దేశంలో బీసీలు దాదాపు 75 కోట్లు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నా, వారి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల,  విద్య, ఉద్యోగ రంగాలలో న్యాయం జరగడం లేదు. కేంద్రంలో మొత్తం 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. తాజాగా సహకార, మత్స్యశాఖలు ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. 

బీసీలకు మంత్రి ఎందుకంటే..
మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు మొదలుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. కేంద్రంలో విద్య, ఉద్యోగాలతో పాటు, పంచాయతీలలో బీసీలకు రిజర్వేషన్లు అమలువుతున్నాయి. వాటన్నింటికీ చూడడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ కావాలి. అంతే కాకుండా ఆర్థికపరమైన రాయితీలు, స్కాలర్‌షిప్స్, రుణాలు, సబ్సిడీ రుణాలతో పాటు, బీసీలకు సంబంధించిన అనేక పథకాల అమలును చూడడం కోసం ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ అవసరం. దేశంలో ఇప్పటికే 29 రాష్ట్రాలలో బీసీ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అలాగే కేంద్రంలో కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. మండల్‌ కమిషన్‌పై కేసు విచారణ సందర్భంగా 1992–93లోనే సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది. అయినా ఇప్పటికీ ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేయకపోవడం సరికాదు. కాబట్టి వెంటనే కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.

రాజ్యాంగపరమైన హక్కు..
వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న బీసీ పథకాలు, కార్యక్రమాలకు కేంద్రం తన గ్రాంట్‌ 60 శాతం ఇవ్వాలి. అది నియమం. బీసీలకు 30 ఏళ్ల క్రితం రిజర్వేషన్లు ఏర్పాటు చేసినా, విద్యా సంస్థలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం మొదలు పెట్టి, 25 ఏళ్లు పూరైనా, ప్రత్యేకంగా బీసీ కమిషన్‌ కూడా ఏర్పాటు చేసినా, ఇప్పటికీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం సరికాదు. నిజానికి కొత్తగా మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవు. నిజానికి ఇది రాజ్యాంగపరమైన హక్కు. 

చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి..
అదే విధంగా చట్టసభల్లో బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించేలా, పార్లమెంటులో బిల్లు పెట్టాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. దీనిపై రాజ్యసభలో మూడేళ్ల క్రితమే ప్రై వేటు బిల్లు కూడా పెట్టడం జరిగింది. దానికి చాలా పార్టీలు మద్దతు ప్రకటించినా, కేంద్రం సానుకూలంగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంది. ఆ బిల్లు ఆమోదం పొందే వరకు వైయస్సార్‌సీపీ పోరాడుతుంది. నిజానికి పార్లమెంటులో బీసీలకు సంబంధించి 8 పార్టీలున్నా, ఏనాడూ అవి ఇలా బీసీ బిల్లును పెట్టలేదు. అదే విధంగా వివిధ పార్టీలకు చెందిన ఉభయ సభల్లో దాదాపు 150 మంది బీసీ సభ్యులున్నా, ఏనాడూ, ఎవరూ బీసీ బిల్లు గురించి ఆలోచించలేదు. ఇందుకు సీఎం వైయస్‌ జగన్‌ చొరవ తీసుకున్నారు. ఆ బిల్లు ఆమోదం పొందే వరకు మా పార్టీ పోరాడుతుంది.

బీసీలకు న్యాయం చేయాలి..
బీసీలకు కేంద్రం తగిన న్యాయం చేయడం లేదు. బీసీలకు కనీసం లక్ష కోట్ల బడ్జెట్‌ పెట్టాలి. కేంద్ర బడ్జెట్‌ రూ.38.45 లక్షల కోట్లు కాగా, అందులో బీసీలకు కేవలం రూ.1400 కోట్లు మాత్రమే కేటాయించడం శోచనీయం. అందువల్ల కనీసం లక్ష కోట్లు ఇవ్వాలి. అలాగే రాష్ట్రాల్లో అమలు చేసే పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలి. అదే విధంగా ప్రై వేటు రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని కోరుతున్నాం. వీటన్నింటిపై ప్రధానికి విజ్ఞప్తి చేయబోతున్నాం.

తాజా వీడియోలు

Back to Top