చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరిక
విచారణ పారదర్శకంగా సాగాలని కోరుకుంటున్నా..
28 Jan 2023 11:15 AM
సీబీఐకి వైయస్ఆర్ సీపీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి లేఖ
వైయస్ఆర్ జిల్లా: సీబీఐ విచారణకు హాజరవుతున్నానని వైయస్ఆర్ సీపీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైనప్పటి నుంచి తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, పనిగట్టుకుని ఓ వర్గం మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నానని చెప్పారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్లకు అనుమతించాలని, తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని, తన విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి కోరారు.