సభా సంప్రదాయాలకు తూట్లు పొడిచేది ప్రతిపక్షమే

ప్రొటెం స్పీకర్‌ చిన అప్పలనాయుడు
 

వెలగపూడి: బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని స్పీకర్‌గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రొటెం స్పీకర్‌ చిన అప్పలనాయుడు అన్నారు. సభా సంప్రదాయాలను తూట్లు పొడించింది ప్రతిపక్షంలో కూర్చున్న వ్యక్తులేనని అన్నారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే నాయకులు సంప్రదాయాలు మనం పాటించడానికి కాదు.. అవతలి వారికి చెప్పేందుకే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రొటెం స్పీకర్‌గా సభా నాయకులు, ఇతర పార్టీల నాయకులు వచ్చి సభాపతిని సాదరంగా ఆహ్వానించి స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టాలని కోరానని గుర్తు చేశారు.

 

Back to Top