‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే
15 Mar 2019 12:58 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. తలకు పెద్ద పెద్ద గాయాలు, చేతి వేళ్లకు కూడా గాయాలయ్యాయన్నారు. నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం 11 గంటలకు ఇంటికి చేరుకున్నారని, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారన్నారు. ఉదయాన్ని వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని, వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు.
అత్యంత సౌమ్యుడు వైయస్ వివేకానందరెడ్డి: ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్ఆర్ జిల్లా అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. ప్రజల కోసమే జీవితం అంకితం చేసిన మహానుభావుడు వైయస్ వివేకానందరెడ్డి అని గుర్తు చేశారు. అత్యంత సౌమ్యుడు, జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని గ్రామాల నాయకులతో వైయస్ వివేకానందరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. గతంలో అన్న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి తోడుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం కుమారుడికి తోడుగా ప్రయాణం చేస్తున్నారన్నారు. కొన్ని రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. కుమారుడు వైయస్ జగన్ మంచి స్థాయికి రాబోతున్నా తరుణంలో వైయస్ వివేకానందరెడ్డి హఠాత్తుగా మరణించడం తీవ్ర బాధను కలిస్తుందన్నారు.
గొప్ప గుణమున్న వ్యక్తి: కాటసాని
శత్రువు కూడా సాయం చేసే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైయస్ వివేకానందరెడ్డి అని వైయస్ఆర్ సీపీ నేత కాటసామి రామిరెడ్డి అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న వివేకానందరెడ్డి మరణం యావత్తు జిల్లా ప్రజలందరినీ కలచివేస్తుందన్నారు.