రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని పూర్తిగా దిగ‌జార్చారు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కొయ్య ప్ర‌సాదరెడ్డి 

పోలవరం ప్రాజెక్టుకు వైయస్ పేరు పెట్టాలి

విశాఖ‌: గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ఖజానాలో కేవలం రూ. 100 కోట్లను మాత్రమే మిగిల్చారని అన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయని... వాటన్నింటినీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అధిగమిస్తారని చెప్పారు. రాష్ట్రంలో అవినీతికి చోటు లేకుండా చేసేందుకు అవినీతిరహిత పాలనకు వైయ‌స్ జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు, వుడా సెంట్రల్ పార్కుకు వైయస్ఆర్ పేరు పెట్టాలని విన్నవించారు. 

తాజా వీడియోలు

Back to Top