చంద్రబాబూ.. ఇంత మోసమా!

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి

అనంతపురం: సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశార‌ని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్య‌క్తి ఇంత మోసం చేస్తారా? అంటూ  వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? అని ప్ర‌శ్నించారు. సూపర్‌సిక్స్‌ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాల‌ని డిమాండు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన అన్ని హామీలను వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ అమలు చేశారని,నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని చంద్ర‌బాబుకు హెచ్చ‌రించారు. ప్రజలు అధైర్య పడొద్దు..వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంద‌ని అనంతవెంకట్‌రామిరెడ్డి పేర్కొన్నారు.

జ‌ర్న‌లిస్టుల‌కు ఎమ్మెల్యే జ‌య‌రాం వార్నింగ్ ఇవ్వ‌డం దారుణం:
మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గమ‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? అంటూ ధ్వ‌జమెత్తారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయ‌ని అన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశార‌ని తెలిపారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింద‌ని విమ‌ర్శించారు. బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నార‌ని అనంతవెంక‌ట్రామిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Back to Top