వాషింగ్టన్ః ఏపీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఘన విజయంతో అమెరికాలో అభిమానులు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.వర్జీనీయ రాష్ట్రంలో విజయోత్సవ సభలో ఎన్ఆర్ఐలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ,తెలంగాణకు చెందిన సుమారు 500 మంది హాజరయ్యారు.మహిళలు,చిన్నారులు ఉత్సాహంగా ఈ విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.వైయస్ఆర్సీపీకి గొప్ప విజయం అందించిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.