టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
తిరుమల ఘాట్రోడ్డును పరిశీలించిన టీటీడీ చైర్మన్
01 Dec 2021 11:28 AM
శరవేగంగా మరమ్మత్తులు చేయించాలని అధికారులకు ఆదేశం
తిరుపతి: తిరుమలకి వెళ్లే రెండవ ఘాట్ రోడ్డు ధ్వంసం కావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకి భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం ఉదయం 5.40 గంటల ప్రాంతంలో భారీ సైజు టన్నుల కొద్ది బరువున్న రాయి పైనుంచి పడటంతో ఘాట్ రోడ్డు నాలుగు ప్రాంతాలలో భారీగా కోతకు గురయ్యింది. దీంతో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు రెండవ ఘాట్ రోడ్లో పూర్తిగా వాహనాలు నిలిపివేయడంతో అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొదటి ఘాట్ రోడ్డు నుంచి విడతల వారీగా తిరుమలకు వెళ్లడానికి వాహనాలకు అనుమతిస్తున్నారు. రెండవ ఘాట్ రోడ్డును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డులో నాలుగు ప్రాంతాలలో రోడ్డు ద్వంసం అయింది. దేవుని దయతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘాట్ రోడ్డును త్వరలో నిపుణుల కమీటి పరిశీలిస్తుంది. వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, ఎంత ఖర్చు అయినా వీలైనంత త్వరగా ఘాట్ రోడ్డును సిద్దం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.