వైయ‌స్ఆర్‌సీపీ నేత సంకిరెడ్డి భౌతికకాయానికి వైయ‌స్‌ జగన్‌ నివాళి

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందుల పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు సంకిరెడ్డి భౌతిక కాయానికి వైయ‌స్‌ జగన్‌ నివాళులర్పించారు.  ఆయనతో పాటు ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి, ఇతర నాయకులు నివాళులర్పించారు. పులివెందులలో ఇటీవల మృతి చెందిన సమీప బంధువు మైఖేల్ కుటుంబాన్ని వైయ‌స్‌ జగన్‌ పరామర్శించారు.
పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో రోజు పర్యటించారు. క్యాంప్‌ కార్యాలయం వద్దవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఆయన కలిశారు.

Back to Top