దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు పీవీ 

మాజీ ప్రధాని పీవీ న‌ర‌సింహారావుకు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేపల్లి: సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రశంసించారు. నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా ఆయ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..  
‘సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు భారతరత్న పీవీ న‌ర‌సింహారావు. భార‌త‌దేశ తొలి తెలుగు ప్ర‌ధానిగా దేశానికి ఎన్నో విశేష‌మైన‌ సేవ‌లందించిన పీవీ జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు’ అంటూ ట్వీట్ చేశారు.  

Back to Top