తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబును ఫోన్ చేసి ప్రత్యేకంగా పరామర్శించారు. టీడీపీ గూండాల చేత అంబటి రాంబాబు ఎదుర్కొన్న హత్యాయత్నంపై వైయస్.జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ కాల్లో వైయస్.జగన్ మాట్లాడుతూ..రాష్ట్రం జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనంగా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతల దుర్మార్గాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, అంబటి రాంబాబు మీద జరిగిన హత్యాయత్నం ఉద్దేశపూర్వకంగా జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ అరాచకపాలనను ప్రజలు సహించబోరున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారని తెలిపారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించడం దుర్వినియోగం అని విమర్శించారు. పార్టీ మొత్తం అంబటి రాంబాబుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్.జగన్ అంబటికి ధైర్యం కల్పించి, ప్రజల, పార్టీ మద్దతు ఎల్లప్పుడూ అతని పక్కన ఉంటుందని వెల్లడించారు.