అమరావతి: ఏపీలో త్వరలో నిర్వహించనున్న టూరిజం ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు రావాల్సిందిగా వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ను ఆహ్వానించారు. బుధవారం వారు కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 900 కోట్లను విడుదల చేయాలని విన్నవించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన 24 దేవాలయాల నిర్మాణానికి నిధులను ఇవ్వాలని కోరారు.