ప్రజలకు ఆపద కలిగినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది పోలీసే

హోంమంత్రి సుచరిత
 

 విజయవాడ : ప్రజలకు ఆపద కలిగినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది పోలీసేనని హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. 2018 బ్యాచ్‌ డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ను బుధవారం మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఐ.జి.పి ట్రైనీ ఐపిఎస్‌ సంజయ్‌ నేతృత్వంలో దీక్షాంత్‌ పెరేడ్‌ అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ .. 25 మందిలో డీఎస్పీలలో 11 మంది మహిళలు ఉండడం చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి రక్షణగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని వారికి పిలుపునిచ్చారు. 

 

Read Also: చంద్రబాబు, టీడీపీ నేతలది రాక్షసానందం

Back to Top