మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
నేడు విశాఖకు వైయస్ జగన్మోహన్రెడ్డి
27 Apr 2019 12:10 PM
నూతన వధూవరులకు ఆశీర్వాదం
బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరు
విశాఖపట్నం: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు,రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు విశాఖకు రానున్నారు. నగరంలో జరుగనున్న వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు, విజయలక్ష్మిల కుమారుడు రవితేజల వివాహానికి హాజరవుతారు. శనివారం రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్కు వెళతారు. వేడుకల్లో పాల్గొన్న అనంతరం అదే రాత్రి హైదరాబాద్కు తిరిగి వెళతారు.