ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
శ్రీకాళహస్తిలో సీఎం వైయస్ జగన్కూ ఓ దేవాలయం..
16 Aug 2021 11:56 AM
జగనన్న నవరత్నాల నిలయం పేరుతో ఆలయ నిర్మాణం
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్తూపాల ఏర్పాటు
చిత్తూరు: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే ప్రజల గుండెల్లో సీఎం వైయస్ జగన్ గూడు కట్టుకోగా..శ్రీకాళహస్తి లో ముఖ్యమంత్రికి ఓ దేవాలయం నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నారు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి 2 కోట్ల రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి ఓ గుడి కట్టించారు. 'నవరత్నాల నిలయం' పేరుతో నిర్మించిన ఈ ఆలయంలో జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఇళ్ల స్థలాల పేరుతో స్తూపాలు కూడా నిర్మించారు.
భారీగా నిర్మించిన ఈ ఆలయంలో హుండీ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే, ఈ హుండీలో కానుకలకు బదులు సమస్యలు, విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చు. ప్రసాదాలుగా ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు అందిస్తారు. జగనన్న నవరత్నాల నిలయాన్ని తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం.గురుమూర్తి ప్రారంభించారు.