అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల శాతం తగ్గింది
08 May 2021 7:40 PM
రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ శాతం తగ్గిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పాజిటివ్ లెక్కల ప్రకారం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 44 శాతం నుంచి 35 శాతానికి కరోనా కేసులు తగ్గాయని చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో ఏపీలోని ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కర్నూలులో కొత్త వైరస్ అంటూ చంద్రబాబు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
కరోనాపై రాజకీయం చేయవద్దని టీడీపీ నేతలకు మంత్రి సూచించారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని చెప్పారు. వీలైతే ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని సూచించారు. ఆక్సిజన్ కొరత లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ట్విట్టర్ లో తప్పుడు పోస్టులు చేయడాన్ని నారా లోకేశ్ మానుకోవాని మంత్రి హితవు పలికారు.