సుప్రీంకోర్టులో నెగ్గిన రాష్ట్ర ప్రభుత్వ వాదన

తక్షణం ఎన్నికల నియమావళి ఎత్తివేయాలి
 

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నియమావళి ఎత్తి వేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది.  తక్షణమే ఎన్నికల కోడ్ ను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, తిరిగి ఎన్నికల తేదీలను ప్రకటించేంత వరకూ అమలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.  ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో ఎన్నికల నియమావళి అమలులోనే ఉండటం సహేతుకం కాదని, దీని వల్ల పాలన కుంటు పడుతుందని కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.  సుప్రీంకోర్టు తీర్పుతో ముందుగా ప్రకటించిన విధంగా ఉగాదికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసుకునే సౌకర్యం ప్రభుత్వానికి లభించింది. ఇదే సమయంలో రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సుప్రీం కోర్టు తీర్పుపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Back to Top