ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు
05 Jun 2023 10:45 AM
వైద్య శాఖ మంత్రి విడదల రజిని
హైదరాబాద్: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన (ఏబీ పీఎంజేఏవై), వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి ప్యానల్ ఆస్పత్రుల సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ.. వైయస్ఆర్ఆరోగ్యశ్రీ పథకం కింద 3,257 ప్రొసీజర్లలో ఉచితంగా వైద్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీ అని చెప్పారు. ఈ పథకం కోసం ఏటా రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ,, ఆయుష్మాన్ భారత్ కింద కేవలం 1,055 ప్రొసీజర్లకు మాత్రమే ఉచితంగా చికిత్స అందేదని, ప్రస్తుతం ఏకంగా 3,257 రోగాలకు చికిత్స అందుతోందని చెప్పారు.
రాష్ట్రంలో ఏకంగా 90 శాతం కుటుంబాలు ఈ సౌకర్యం పొందుతున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 డాక్టర్ వైయస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్లలో 49 వేలకు పైగా నియామకాలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.
వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును కేంద్ర సహాయ మంత్రి బాఘెల్ ప్రశంసించారు. కార్యక్రమంలో వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవో హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు.