ఎమ్మిగనూరు: ఈ రోజు జరిగిన సామాజిక సాధికార యాత్రకు.. నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీ వెంబడి నడిచిన జనం... బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ పూర్తయ్యేవరకు ఏ ఒక్కరూ కదలకపోవడం విశేషం. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు సంజీవ్కుమార్, గోరంట్ల మాధవ్, గురుమూర్తి పాల్గొన్నారు. ఇంకా స్థానిక సంస్థలు ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు మంత్రి మేరుగ నాగార్జున –సామాజిక సాధికార యాత్ర చరిత్ర పుటల్లో లిఖించబడుతుంది. గతంలో –మహానుభావులెందరో..ఈ దేశంలో సామాజిక సాధికారత సాధించాలని ఉద్యమాలు చేశారు. – ఈ రాష్ట్రంలో...ఆ మహనీయుల ఆశయాల బాటలో నడిచి..మనకు సామాజిక సాధికారత అందించారు సీఎం జగనన్న. –గతంలో చంద్రబాబు మనల్ని బెదిరించారు. చులకనగా మాట్లాడారు. –జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలు గుండెల మీద చెయ్యివేసుకుని ముందుకు నడుస్తున్నారు. –ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఆయా వర్గాల ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు జగనన్న. –మన జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మన పిల్లల భవిష్యత్ గురించి ..ఎంతో ముందుచూపుతో పథకాలు అమల్లోకి తెచ్చారు. –విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. –జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడం మన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చాలా చాలా అవసరం. ఎంపీ సంజీవ్కుమార్ –ఇంతకు ముందు మన దళితకుటుంబాల వారు తలవంచుకుని బతికేవారు. – అలాంటి వారిని అక్కున చేర్చుకుని, వారి తలరాతలు మార్చారు జగనన్న. – జగనన్న పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత సాధించిపెట్టారు సీఎం జగనన్న. –సామాజిక న్యాయానికి అసలు సిసలు అర్థం చెప్పారు. –ఈరోజు మనం ఎవరికీ భయపడాల్సిన లేదు. మనకు జగనన్న అండ ఉంది. ఆయన చేయూత ఉంది. ఆయన భరోసా ఉంది. దేవుడు జగన్గారి వెంట ఉన్నాడు. ఆయన ద్వారా మనకు సాయం చేసేలా చేస్తున్నాడు. –ఇప్పుడు జగనన్న పాలనలో మన ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ జగనన్న వెంట నడవాలి. –పేదల కోసం, బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం జగనన్న చేస్తున్న మంచి, దేశంలో ఏ రాష్ట్రంలో... ఏ ముఖ్యమంత్రి చేయట్లేదు. ఎంపీ గోరంట్ల మాధవ్ –ఈరోజు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే..చాలా సంతోషమేస్తోంది. జగనన్న మీద అభిమానంతో మీరంతా వచ్చారని అర్థమవుతోంది. –మన ప్రత్యర్థి చంద్రబాబు గారు రాజకీయంగా చేసిన అరాచకాలు మనకందరికీ తెలుసు. – ప్రత్యేకహోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమని చెప్పి, స్పెషల్స్టేటస్ను వదిలేసిన బాపతు రాజకీయనాయకుడు చంద్రబాబు. – ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పదేళ్లపాటు అక్కడ నుంచి పాలన చేసే అవకాశం ఉన్నా, వదిలేసి వచ్చిన వాడు చంద్రబాబు. –చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తన హయాంలో ఎన్నెన్ని స్కాములు చేశాడో లెక్కకు మించి ఉంటాయి. –వ్యవసాయం దండగ అని పనికిమాలిన మాటలు మాట్లాడిన నాయకుడు చంద్రబాబు. –ఉచితవిద్యుత్ అడిగితే, విద్యుత్ బిల్లులపై ఉద్యమం చేస్తే, హైద్రాబాద్లో రైతులపై గుర్రాలతో తొక్కించి, కాల్పులు చేపించిన రాక్షసుడు బాబు. –ఇక ఎస్సీ,ఎస్టీ,బీసీలను కులం పేరిటే చులకన చేసి మాట్లాడారు –చంద్రబాబు.మైనార్టీలను దేశద్రోహుల కింద లెక్కేసిన దుర్మార్గుడు. వారిపై కేసులు కూడా పెట్టారు. ఎంపీ గురుమూర్తి –అర్హతలున్న లబ్దిదారుల్లో ఏ ఒక్కరూ సంక్షేమపథకాల లబ్ది పొందకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ తపిస్తున్నారు. ఇంటి గడప దగ్గరకే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చేస్తున్నారు. –వివక్ష లేకుండా, లంచాలు లేకుండా, పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత జగనన్న ప్రభుత్వానిదే. –సమాజంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా వుంటేనే, బాగా చదువుకుని ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. నాడు–నేడు పథకంతో విద్య,వైద్యరంగాల్లో జగనన్న తెచ్చిన మార్పులు అద్భుతమైనవి. అవి పేదల జీవితాల్లో ఎంత వెలుగులు నింపుతున్నాయో మన కందరకు తెలుసు. – భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఆ సామాజికాభివృద్ది స్పష్టంగా కనిపించి తీరుతుంది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి –వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ, ప్రజల వద్దకు పాలనను తెస్తానని హామీ ఇచ్చారు. – మాట తప్పని జగన్ చెప్పినట్టే చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తోంది. –బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను ఒక స్థాయికి తీసుకెళ్లారన్నా, రాజకీయ పదవుల్లో కూర్చోబెట్టారన్నా.. ఆ ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిగారికే దక్కుతుంది. – 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ సోదరులను ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిదే. –ఎంపీటీసీ, జెడ్పీసీలుగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను నిలబెట్టి గెలిపించారు జగనన్న. –ఇక పేదవర్గాల ఆర్థికస్థాయిని పెంచేందుకు ..వారి ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా రూ.2.36వేల కోట్లు అందించారు సీఎం జగన్. –విద్యా, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులతో అట్టడుగువర్గాలు, అణచివేయబడ్డ వర్గాలకు గొప్ప మేలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. –ఈ రోజు ఆయా వర్గాల పిల్లలు గర్వంగా సర్కారు బళ్లకు వెళుతున్నారన్నా, కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో చదువుతున్నారన్నా అది జగన్ ఘనతే. అలాగే ఎలాంటి జబ్బు వచ్చినా భయపడకుండా, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందేలా చేశారు జగన్. – ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలన ప్రజల పాలన. సుపరిపాలన. పారదర్శక పాలన.