వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపిన వైయ‌స్ జ‌గ‌న్

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ప్రార్ధన చేశారు. వేడుకల్లో  వైయస్‌ జగన్‌ మేనత్త వైయస్‌ విమలమ్మ, వైయ‌స్ఆర్‌సీపీ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ ప్రెసిడెంట్‌ బి.జాన్‌ వెస్లీ, పాస్టర్‌ టి.ఎస్‌.ఆర్‌ ప్రసాద్‌ రెడ్డి (కవితం), పాస్టర్‌ జీవన్‌ కుమార్‌ (ఏపీపీఎఫ్‌, ఏలూరు), బిషప్‌ రెబ్బ ఇమ్మాన్యుయేల్‌ (రేపల్లె), రెవరెండ్‌ వి.కే.జేమ్స్‌ కుంపట్ల (ఏడిఎఫ్‌, విశాఖపట్నం), రెవరెండ్‌ ఎన్‌.ఐ.సోలోమన్‌ రాజు (వరల్డ్‌ విజన్‌, అవనిగడ్డ), రెవరెండ్‌ డి.రాజశేఖర్‌ (ఎన్‌బిఎమ్‌, నెల్లూరు), రెవరెండ్‌ ఎం.సుధాకర్‌ పాల్‌ (సీఎంసీ, వైజాగ్‌), రెవరెండ్‌ విజయ్‌ కిషోర్‌ (కడప), రెవరెండ్‌ మనోజ్‌ బాబు (తణుకు), బిషప్‌ శ్రావణ్‌ కుమార్‌ (కోనసీమ జిల్లా), పాస్టర్‌ శ్రావణ్‌ (తూర్పు గోదావరి), పాస్టర్‌ గెరా హనోక్‌ (ఏఐసీసీ ప్రెసిడెంట్‌), బ్రదర్‌ కమలాకర్‌ (ఏఐసీసీ, విజయవాడ), పాస్టర్‌ కే.ఎలిషా (గణపవరం), పాస్టర్‌ జాషువా మూర్తి (విజయవాడ), పాస్టర్‌ మోజెస్‌ (విజయవాడ), జేసు రత్నాకర్‌ (మెజిస్ట్రేట్‌, గుంటూరు), బ్రదర్‌ వై.ప్రసాద్‌ బాబు (విశాఖపట్నం) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top