సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీ సభ్యురాలు మేకతోటి సుచరిత, కమిటీ సభ్యులు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, సీసీఎల్ఏ నీరబ్కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడి) ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డిలను కమిటీ ఎంపిక చేసింది.