సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన లక్ష్మణ్‌రెడ్డి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లక్ష్మణ్‌రెడ్డి సీఎంను కలిశారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top