తాడేపల్లి: కవిత్వం ద్వారా సామాజిక విప్లవానికి బీజం వేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అంటూ వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా, దళితుల హక్కుల కోసం ధైర్యంగా నిలబడి రచనలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన అంటూ కీర్తించారు. ఇవాళ గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.