ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌

లాక్‌డౌన్‌ పొడిగింపుపై  సీఎంలతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ  

తాడేపల్లి:  దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్ పాల్గొన్నారు.  ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే దేశంలో ఏ విధమైన కొత్త సమస్యలూ రాకుండా చూడాలని మోదీ సీఎంలకు సూచిస్తున్నారు. లాక్‌డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ విషయంపైనే చర్చిస్తున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన మరిన్ని అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు.  ఇప్పటికే పలువురు సీఎంలు లాక్‌డౌన్‌ పొడిగించాలనే మోదీని కోరారు.

Back to Top