కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
సంక్షేమాభివృద్ధికి పార్టీ బలం తోడైతే గెలుపు సులువే..
09 Dec 2022 8:19 AM
వైయస్ఆర్ సీపీ నాయకులకు పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం
50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.20 లక్షల మంది గృహ సారథులు
ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు.. వీరిలో ఒక మహిళ తప్పనిసరి
ఈ నెల 20 నాటికి 45 వేల మంది కన్వీనర్లను నియమించాలి
ఆ తర్వాత గృహ సారథుల నియామకం..
ప్రతి ఇంటికి, పార్టీకీ మధ్య అనుసంధానకర్తలుగా కన్వీనర్లు, గృహ సారథులు
తాడేపల్లి: ``బూత్ కమిటీ నుంచి బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేయాలన్నదే మన లక్ష్యం. నెట్వర్క్ బలంగా ఉండడం వల్ల గెలుపు చాలా సులభం అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే పరిశీలకుల లక్ష్యం కావాలి. 175కు 175 గెలవాలి. ఈ నెట్వర్క్ మొత్తాన్ని బలంగా పని చేయించాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులందరి మీదా ఉంటుంది. మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. మన ఎమ్మెల్యేలను గెలిపించుకుని వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ నుంచి మీకు తప్పక గుర్తింపు ఉంటుంది. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత కూడా`` అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైయస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సీఎం చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా అమలవుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలకు పార్టీ బలం కూడా తోడైతే వచ్చే ఎన్నికల్లో మన గెలుపు మరింత సులువవుతుంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతమవ్వడం కోసం ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.20 లక్షల మందిని పార్టీ తరఫున గృహ సారథులుగా నియమిస్తున్నాం. వీరు బూత్ కమిటీలలో సభ్యులుగా ఉంటారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లను నియమిస్తున్నాం. ఇందులో ఒక అక్క లేదా చెల్లెమ్మ కూడా ఉంటుంది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింది స్థాయిలో ఇంటింటికీ.. నెలకు కనీసంగా 4 నుంచి 5 సచివాలయాల్లో తిరుగుతున్నారు. ఇదే సమయంలో మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలి. దీనికోసం 10–15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం.
క్షేత్ర స్థాయిలో మన సైన్యాన్ని వ్యవస్థీకృతం చేద్దాం
వైయస్సార్సీపీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలపై ఓరియంటేషన్ (పునశ్చరణ) కోసం మిమ్మల్ని అందర్నీ పిలిచాం. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో ఎలా పనిచేయాలన్నదానిపై ఒక ప్రణాళికను మీకు వివరిస్తా. క్షేత్ర స్థాయిలో మన పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు రీజనల్ కో ఆర్డినేటర్లకు, పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ పరిశీలకులకు విధివిధానాలు నిర్దేశిస్తున్నాం.
గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. వీరిలో కనీసం ఒక మహిళ ఉంటారు. వీరందరూ స్థానికులై ఉండాలి. వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు.. రాజకీయ అవగాహన కలిగిన, చురుగ్గా ఉన్న వారిని ఈ నెల 20వ తేదీ నాటికి కన్వీనర్లుగా ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అంతా సక్రమంగా జరిగేలా నియోజకవర్గాల పరిశీలకులు చూస్తారు.
ప్రతి 50 ఇళ్ల వారీగా మ్యాపింగ్
కన్వీనర్ల ఎంపిక తర్వాత ప్రతి 50 ఇళ్ల క్లస్టర్కు ఒక పురుషుడు, ఒక మహిళ చొప్పున ఇద్దరు గృహ సారథుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గృహ సారథులు కూడా అదే క్లస్టర్కు చెందిన వారై ఉండాలి. వీరు పార్టీ సందేశాన్ని చేర వేయడం, పార్టీ తయారు చేసిన పబ్లిసిటీ మెటరీయల్ను అందించడం తదితర కార్యక్రమాలు చూస్తారు. ఇందుకోసం ప్రతి 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నాం.
మొత్తంగా 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహ సారథులు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 45 వేల మంది కన్వీనర్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి పార్టీ సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్ని అందిస్తారు. 15 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలుసుకుంటారు. మొదటిసారి ఇలా తిరగడం వల్ల ఆ సచివాలయం పరిధిలో ఒక అవగాహన వస్తుంది. అన్ని సచివాలయాల పరిధిలో కూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది.
సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పని తీరుపై నిరంతరం మదింపు ఉంటుంది. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు.
మీ కష్టానికి తగిన గుర్తింపు ఖాయం
మన ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో 84% కుటుంబాలకు మేలు జరిగింది. కార్పొరేషన్లలో 78 శాతం నుంచి 80%కుటుంబాలకు మేలు జరిగింది. ఇలాంటి మంచి వాతావరణంలో మనం అడుగులు ముందుకేస్తున్నాం.
సాధారణంగా రాజకీయ నాయకులు ఊళ్లలో తిరగడానికి భయపడతారు. కానీ మొదటి సారి.. నాన్న (వైయస్సార్) హయాంలో శాచ్యురేషన్ పద్ధతిలో పథకాలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అర్హత ఉన్నవారికి ఎవ్వరికీ నిరాకరించకుండా పథకాలు అమలుచేశాం. మూడున్నరేళ్లుగా ప్రతి కుటుంబానికీ మేలు జరిగింది. మన పార్టీ వల్ల మేలు జరిగిందన్న సంతోషం ఎమ్మెల్యేలకూ ఉంది. అందువల్లే ధైర్యంగా ఊళ్లలోకి వెళుతున్నారు. పార్టీలో ఎక్కడైనా చిన్నచిన్న బేధాలుంటే సరిదిద్దాల్సిన బాధ్యత రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులపై ఉంది.
బటన్ నొక్కడమే కాదు (సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డబ్బులు జమ చేయడం).. ఈ నెట్వర్క్ మొత్తం చాలా బలంగా పని చేయాలి. ఈనెల 20వ తేదీలోగా సచివాలయాల పరిధిలో కన్వీనర్ల నియామకం పూర్తయ్యేలా చూడటం ద్వారా ఈ కొత్త బాధ్యతలో తొలి అడుగు బలంగా వేయాలి. మీ కష్టానికి తగిన ఫలితం తప్పక ఉంటుంది.