సీఎం వైయ‌స్ జగన్​మోహన్​ రెడ్డిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైయ‌స్​ జగన్​మోహన్​ రెడ్డిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి  స్పష్టం చేశారు. ఏమీ తినడానికి దొరకని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని ఆయ‌న  ట్వీట్​ చేశారు. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయన్నాయని గ్రహించేలోగానే, మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని చెప్పారు. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో ముందు ముందు చూడాలన్నారు. 

లిటిగేటర్ల అవతారం
అవసరాల కోసం స్వార్థంతో జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారని విజ‌య‌సాయిరెడ్డి విమర్శించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని హెచ్చరించారు. మీడియా ఎంటర్​టైనర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని తెలిపారు. 

Back to Top