తాడేపల్లి: ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బూత్ వారీ లెక్కలు గురించి ప్రజలు మాట్లాడుకోకుండా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెర దించిందని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ విష ప్రచారం చేసి దీక్షలకు దిగారని మండిపడ్డారు. హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రఎన్నికలకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "ప్రపంచ బ్యాంకు జీతగాడు...చంద్రబాబు మోసగాడు"......అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుంది. ~ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత "ఫార్మ్ 20" వెబ్ సైట్ లో పెట్టింది . పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు . ~ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేసారు. ~ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్ తో మొదలెట్టారు. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం . ~ చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు. ~ప్రజలెవ్వరూ .. బూత్ వారీ లెక్కలు గురించి మాట్లాడుకోకుండా లడ్డు దీక్షలు, వగైరా .....వగైరా ..... ~ఇదీ స్థూలంగా జరుగుతున్న కుట్ర .. ~ ఉదాహరణకు హిందూపురం ఒక వార్డులో వచ్చిన ఓట్లు ..( ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టారు ) అసెంబ్లీ -- వైయస్ఆర్సీపీ - 1 టీడీపీ - 95 బీఎస్పీ - 5 కాంగ్రెస్ - 464 అదే వార్డులో పార్లమెంట్ వైయస్ఆర్సీపీ - 472 కాంగ్రెస్ - 1 టీడీపీ - 8 బీఎస్పీ - 83 ఇది సాధ్యమా ? ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల టేమ్పెరింగే. ~దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది . రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి . కానీ అయిదు ఆరు దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి కలిపి జరిగిన ఆంధ్రా లో ఈవీఎంలు (tampering) మోసంచేసారు . ~ ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, టెర్రాసొఫ్ట్ మరి కొంతమంది కలిసి చేసిన కుట్ర. ఎన్నికల ముందు చంద్రబాబు జర్మనీ, దుబాయ్, లోకేష్ ఇటలీ, జర్మనీ, దుబాయ్ ప్రయాణాలు ఈ ఈవీఎంల టాంపరింగ్ మరియు డబ్బులు బదిలీ కోసమే అన్నది సుస్పష్టం. ~ చంద్రబాబు కు లోకేష్ కు హిందూమతం ఫై కానీ, భగవంతుడి ఫై కానీ నమ్మకంలేదు. వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులు. చంద్రబాబు ఈ మోసాలు వెన్నతో పెట్టిన విద్య. అందరూ కలిసి ఈ అరాచకానికి తెరదీశారు .ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూ ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఈ దోపిడీదొంగల టీడీపీనే అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.