మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీదే
09 Feb 2022 2:40 PM
ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: ఏపీ విభజన అడ్డగోలుగా చేశారు కాబట్టే కాంగ్రెస్ను ప్రజలు సమాధి చేశారని, అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందని వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండు చేశారు. లోక్సభలో ఎంపీ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్న విషయాన్ని ప్రధాని ఇప్పుడు చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ రాష్ట్రాభివృద్ధి వదిలేసి పనికిమాలిన ఫిర్యాదులు చేస్తోందని.. రాష్ట్రాభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.